మంచు లక్ష్మి రాజకీయ విమర్శలు

manchu lakshmi support to ktr over digvijay singh comment

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా ఉంది. టాలీవుడ్‌కు చెందిన వందల సంఖ్యలో ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా సిట్‌ వద్ద సమాచారం ఉంది. కాని కొద్ది మందికి మాత్రమే నోటీసులు జారీ చేసి, వారిని విచారిస్తున్నారు. అయితే నోటీసులు అందుకోని వారు చాలా మంది ఉన్నారు. వారు ప్రభుత్వంతో కాపాడబడుతున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ ఈ విషయమై ట్విట్టర్‌లో స్పందిస్తూ.. టీఆర్‌ఎస్‌ నాయకుడి స్నేహితులు డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడిని విచారిస్తారో లేక వదిలేస్తారో చూడాలి అంటూ ట్వీట్‌ చేశాడు.

డిగ్గీ రాజా ట్వీట్‌కు కేటీఆర్‌ కాస్త ఘాటుగా స్పందించాడు. మీరు ముసలివారు అయ్యారు, మీకు మతిస్థిమితం సరిగా లేదు, రాజకీయాలను పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవాలి అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశాడు. కేటీఆర్‌ ట్వీట్‌ను సమర్ధిస్తూ మంచు లక్ష్మి రామ్‌ చెప్పింది కరెక్ట్‌, ఆయన చాలా రోజుల క్రితమే మతిస్థిమితం కోల్పోయాడు అంటూ మంచు లక్ష్మి ట్వీట్‌ చేయడం అందరిని ఆశ్చర్యంకు గురి చేసింది. ఈ విషయంలో మంచు లక్ష్మి ఇంతగా రియాక్ట్‌ అవ్వడం ఏంటని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. గత కొన్నాళ్లుగా టీఆర్‌ఎస్‌ పార్టీతో, కేటీఆర్‌తో మంచు వారి ఫ్యామిలీ సన్నిహితంగా మెలుగుతున్న విషయం తెల్సిందే. అందులో భాగంగానే ఇలా ట్వీట్‌ చేసి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మంచు లక్ష్మి రాజకీయ విమర్శలు - Telugu Bullet

మంచు లక్ష్మి రాజకీయ విమర్శలు - Telugu Bullet

మరిన్ని వార్తలు

కోవిద్ గెలిచారు… మీరాకి అక్కడ ఒక్క ఓటు కూడా రాలేదు.

వెంకయ్యని తప్పించారా ?

చిరు151 ఆసక్తికర వార్త