మెకానిక్ వేధింపులు తాలలేక బీటెక్ స్టూడెంట్ సూసైడ్..

Couple Commit Suicide After Daughter Elopes With Lover

హైదరాబాద్ లో ఘోరం చోటుచేసుకుంది. ఓ టైర్ల షాపులో పని చేసే యువకుడి వేధింపులను తాలలేక ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని అమీర్‌పేటలో జరిగిన ఈ ఘటన పట్ల స్థానికులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు.

అమీర్‌పేట ఈస్ట్‌ శ్రీనివాస్‌నగర్‌ కాలనీలోని అనురాగ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండే ఆర్టీసీ కండక్టర్‌ ఎం. గోపాల్, లావణ్య దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే వారిలో పెద్ద కూతురు అశ్విని గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది. కాగా కొద్దిరోజుల నుండి ఆమెను ఇంటికి సమీపంలో ఉన్న టైర్ల కొట్టులో పని చేసే నవీన్ అనే యువకుడు వేధిస్తున్నాడు. దీంతో ఎంతో మనస్థాపానికి గురైన అశ్విని తాజాగా చదువుకుంటానని ఇంట్లో చెప్పి అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లింది. అలా పైకి వెళ్లి తనను నవీన్ వేధిస్తున్నాడని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ వెల్లడించింది. కాగా వెంటనే ఆమె తండ్రి పైకి వెళ్లి చూడగా అప్పటికే నోట్లో నుండి నురగలు రావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.