మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం

మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం

టాలీవుడ్ టైర్ 2 స్టార్ హీరో అయినటువంటి నితిన్ హీరోగా టాలీవుడ్ లక్కీ హీరోయిన్ రష్మికా మందన్న హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “భీష్మ”. కామెడి మరియు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రం చాలా కాలం నితిన్ అభిమానులు ఎదురు చూసిన నిరీక్షణకు మంచి ఫలితాన్ని అందించింది.ఇప్పటికీ మంచి రన్ ను కొనసాగిస్తున్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ గా కూడా స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రం తాలూకా సాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న జెమినీ టీవీ అనుబంధ స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి సన్ నెక్స్ట్ లోనే ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నట్టు సమాచారం.ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 7 నుంచి నెక్స్ట్ లో స్ట్రీమ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.మరి ఈ చిత్రం అప్పుడే అందుబాటులోకి వస్తుందో లేదో చూడాలి.