సాలూరు, బొబ్బిలిలో తేలికపాటి భూ ప్రకంపనలు

సాలూరు, బొబ్బిలిలో తేలికపాటి భూ ప్రకంపనలు
Mild earthquake in Ap

గతంలో విజయనగరం జిల్లా సాలూరు, బొబ్బిలిలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

బొబ్బిలి నియోజకవర్గం పట్టణంలోని పోరాటవీధి, గాంధీ బొమ్మ సెంటర్, కోల్‌బాగ్, రామభద్రపురం వీధుల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. బొబ్బిలిలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు భూవిజ్ఞాన నిపుణులు తెలిపారు. రెండు సెకన్లకు మించి భూకంపం వచ్చినప్పుడు ప్రజలు ఇళ్లు లేదా భవనాల నుంచి బయటకు రావాలని వారు సూచించారు.

ప్రకంపనల కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు