పెళ్లి తర్వాత చై, సామ్‌లను కలుపబోతున్న మారుతి?

Naga Chaitanya and Samantha to team up after marriage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని హీరో నాగచైతన్య, సమంతల కాంబినేషన్‌లో ఇప్పటి వరకు ‘ఏమాయ చేశావే’, ‘మనం’, ‘ఆటోనగర్‌ సూర్య’ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి రొమాంటిక్‌ సీన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరి కాంబో సస్సెస్‌ కాంబోగా పేరు తెచ్చుకుంది. వీరిద్దరు రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లో కూడా ప్రేమికులు. ఇప్పటికే వీరిద్దరి వివాహ నిశ్చితార్థం పూర్తి అయ్యింది. త్వరలోనే వివాహం కూడా జరుగబోతుంది. అక్టోబర్‌లో జరుగనున్న వివాహానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెళ్లి తర్వాత సినిమాలు కంటిన్యూ చేస్తాను అంటూ చెప్పిన సమంత, పెళ్లి అయిన వెంటనే మొదటి సినిమాను భర్త నాగచైతన్యతో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, సమంతల కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఆ సినిమాను నవంబర్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఆ సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దసరాకు మహానుభావుడు రాబోతున్నాడు. ఇప్పటికే చైతూకు మారుతి ఒక కథ చెప్పడం ఆ కథలో సమంతతో కలిసి నటిస్తాను అంటూ చెప్పడంతో మారుతి ఫుల్‌ జోష్‌తో స్క్రిప్ట్‌ను పూర్తి చేయబోతున్నాడు. మహానుభావుడు విడుదలైన వెంటనే చైతూ, సమంతలను కలిపే పని మారుతి నెత్తిన వేసుకోబోతున్నాడు. పెళ్లి తర్వాత వీరిద్దరు చేయబోతున్న సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి అంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు:

పవన్‌పై కామెంట్స్‌ చేసిన మహేష్‌… మెగా ఫ్యాన్స్‌ సీరియస్‌

రెచ్చగొడుతున్న వర్మ.. మూసుకున్న విహెచ్‌

పెళ్లి తర్వాత చై, సామ్‌లను కలుపబోతున్న మారుతి? - Telugu Bullet