నాగ చైతన్య కెరీర్ ఇప్పుడు అంత మంచిగా లేదు, వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. నిర్మాతలు కూడా చైతుతో సినిమా నిర్మించాలి అంటే వామ్మో అంటున్నారు. అయన నటించిన యుద్ధం శరణం, శైలజ రెడ్డి అల్లుడు, సవ్యసాచి చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్ల పడ్డాయి. వరుస ఫ్లాప్ లు రావడం తో వేరే ఏ హీరో అయినా మినిమమ్ రెండు మూడు సంవత్సారాలు పట్టేది సినిమా చేయ్యాడానికి. కానీ చైతు ప్రస్తుతం మజిలి అనే చిత్రంలో నటిస్తున్నాడు. భార్య సమంతతో కలిసి ఈ చిత్రంలో తన అదృష్టంను పరిక్షించుకోనున్నాడు. మజిలి చిత్రం పిరియాడికల్ నేపథ్యం కలిగిన కథ. ఇప్పుడు అందరు హీరోలు డైరక్టర్స్ రూటు మార్చారు కధ ఎక్కువ పిరియాడికల్ నెపథ్యం కలిగిన చిత్రాల్లలో నటించడానికి ఇష్ట పడుతున్నారు. అందుకే చైతు కూడా సేమ్ ఫార్ములాను ఫాలో అవ్వుతున్నాడు.
1990లో జరిగిన కొన్ని సీన్స్ మరియు కొన్ని రెగ్యూలర్ సిన్స్ తీస్తారు అంట. ఇలాంటి చిత్రాలు ఇప్పుడు ప్రేక్షకుల అధరిస్తారా! అనే అలోచన లేకపోలేదు. ఈ చిత్రంలో నాగర్జున మూవీలోనుండి ఏదైనా సాంగ్ ను రీమీక్స్ చేయ్యాలి అని చిత్ర యూనిట్ సభ్యులు అనుకుంటున్నారు. నాగ చైతన్య ఇంతకుముందు సవ్యసాచి చిత్రంలో నిన్ను రోడ్డు మీద అనే సాంగ్ ను రీమీక్స్ చేశారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి కూడా అంత రెస్పాన్స్ వచ్చింది లేదు. మజిలి చిత్రం కోసం మరో సాంగ్ ను ఎందుకు రీమీక్స్ చేయ్యడం అని ప్రేక్షకులు పెదవి విరుచుకుంటున్నారు. మజిలి చిత్రంతో చైతు మంచి విజయం సాదించి ట్రాక్ లోకి వస్తాడా లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు అగాలి.