రోబో 2.0 లో కీరవాణి పాడిన పాట నాగార్జునకి తెగ నచ్చేసిందంట…!

Nagarjuna Favorite Song Is The Song Of Keeravani In Robo 2.0 Movie

అదేంటీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి రోబో 2.0 లో పాట పాడడం ఏమిటీ…అందులోనూ ఆ సినిమాకి రెహ్మాన్ సంగీత దర్శకుడు కదా అని అనుకుంటున్నారా…? మీరు విన్నది నిజమే, ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతదర్శకత్వం అందిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రోబో 2.0’ సినిమాలో మన సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి “బుల్లిగువ్వా.. ఓ బుల్లిగువ్వా.. నీ కూతకై నే వేచానే” అంటూ సాగే ఒక పాట ని పాడారు.

nagarjuna

ఈ పాట లో రెహ్మాన్ కొడుకైన ఏ. ఆర్. అమీన్ కూడా కోరస్ పాడాడు. ఈ పాట విన్న అక్కినేని నాగార్జున ఈ పాట చాలా బాగుందని, కీరవాణి అద్భుతంగా పాడారని తన ట్విట్టర్ పేజీలో కొనియాడారు.ఇక రోబో 2.0 సినిమా విషయానికి వస్తే, సుమారు 550 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు లో ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ విడుదల చేస్తున్నారు.

nagarjuna-twitted

సూపర్ స్టార్ రజినీకాంత్ వశీకర్ మరియు చిట్టి (హ్యూమనోయిడ్ రోబో) అంటూ ద్విపాత్రాభినయం చేస్తుండగా, అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. రోబో లో నటించిన ఐశ్వర్య రాయ్ ఈ సీక్వెల్ లో అతిధి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ రోబో 2.0 లో క్రోమాన్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల అనగా నవంబర్ 29 న విడుదలవుతుంది. మరి ఈ సినిమా బాహుబలి రికార్డులను తిరగరాస్తుందో లేదో వేచిచూడాలి.