రజని టైపు లో బ్రాహ్మణి పంచ్ డైలాగ్ భలే పేలింది.

Brahmani's-Smart-Answer-To-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సాఫీగా బండి నడుస్తున్నప్పుడు డ్రైవర్ సామర్ధ్యం తెలియదు. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే ఆ డ్రైవర్ సామర్ధ్యం బయటపడుతుంది. ఇది ఒక్క డ్రైవింగ్ విషయంలోనే కాదు మనిషికి, అతని జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు నారా బ్రాహ్మణి విషయంలోనూ ఓ సవాల్ ఆమె సామర్ధ్యాన్ని బయట పెట్టింది.హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ఆమె హెరిటేజ్ ప్రతినిధిగా పాల్గొన్నారు.

Nara-Brahmani-Gave-a-Smart-

ఇవంకా ట్రంప్, ప్రధాని మోడీ, ఇంకా పలువురు అంతర్జాతీయ స్థాయి మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్న ఈ సదస్సు నుంచి బయటకు వస్తున్న బ్రాహ్మణిని ఓ ఛానల్ విలేకరి చౌకబారు ప్రశ్న ఒకటి అడిగారు. హైదరాబాద్ లో ఈ సదస్సు జరగడం అసూయ కలిగిస్తోందా అని. ఆ ప్రశ్నకు ఓ రేంజ్ లో బ్రాహ్మణి సమాధానం ఇచ్చారు. తన గౌరవం కోల్పోకుండానే ప్రశ్న అడిగిన వ్యక్తి నీళ్లు నమిలేలా చేయగలిగారు బ్రాహ్మణి.

nara-brahmani-powerful-dial

బ్రాహ్మణి ఇచ్చిన సమాధానం ఇలా వుంది . “ సదస్సు ఎక్కడ జరుగుతుందన్నది ముఖ్యం కాదు . దాని నుంచి ఏమి నేర్చుకున్నాం , ఎంత స్ఫూర్తి పొందాం అన్నదే ముఖ్యం. అమరావతిలో కిందటేడాది అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ జరిగింది. అలాగే ఇది. అయినా మీలాగా మేము ఆలోచించలేం” అంటూ బ్రాహ్మణి ఇచ్చిన సమాధానంతో ఆ ప్రశ్న వేసిన రిపోర్టర్ కి దిమ్మ తిరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రజని పంచ్ డైలాగ్ తరహాలో బ్రాహ్మణి సమాధానం వైరల్ అవుతోంది.

Nara-Brahmani-attends-Globa

ఇక ప్రత్యక్ష రాజాకీయాల్లోకి ఏళ్ళ కొద్దీ నలిగిన వాళ్ళే ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి అంటే తడబడతారు. అయితే ఆ అనుభవం లేకపోయినా సమయస్ఫూర్తితో , గౌరవప్రదం గా సమాధానం ఇస్తూనే ఎదుటి వారిని డిఫెన్స్ లోకి నెత్తిన బ్రాహ్మణి సామర్ధ్యం చూస్తుంటే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.