శుక్రవారాన్ని ఆలా వాడేసుకున్న లోకేష్… జగన్ కి షాక్.

nara lokesh comments on Jagan over Assets

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతాడని తెలుసుకునే లోకేష్ తమ కుటుంబ ఆస్తుల ప్రకటన కూడా అదే రోజు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇది కాకతాళీయంగా జరిగింది కాదు. ఓ వ్యూహం ప్రకారమే జగన్ ని ఇబ్బంది పెట్టేందుకు శుక్రవారాన్ని లోకేష్ వాడుకున్నారు. ఆస్తుల ప్రకటన సందర్భంగా జగన్ కి షాక్ ఇచ్చేలా లోకేష్ చేసిన కామెంట్స్ మీరే చూడండి.

  • ప్రతిపక్ష పార్టీ కూడా ఈ విధానాన్ని ప్రారంభించాలి.

  • జగన్ కూడా ఇదే విధంగా ఆస్తులు ప్రకటించాలి.

  • మేం స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటిస్తున్నాం.

  • జగన్ ఆస్తులను సీబీఐ ప్రకటిస్తోంది.

  • ఏడేళ్లుగా ఇదే విధంగా ఆస్తులు ప్రకటిస్తున్నాం.

  • మాపై విమర్శలు చేసే వాళ్ళు ఏనాడైనా వారి ఆస్తులు ప్రకటించారా ?

  • వారసులుగా మేం సమర్ధంగా పని చేయకుంటే రాజకీయాల్లో నిలబడలేము.

  • వారసులుగా అవకాశం వచ్చిన మాట వాస్తవమే… అయితే ప్రజామోదం ఉంటేనే నిలబడగలం.

  • జగన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో తెలియదు.

  • అసెంబ్లీలో మేమే ప్రతిపక్షంగా వ్యవహరించాం.

  • కాంగ్రెస్ అధికారంలో ఉండగా పునరావాస ప్రక్రియను ఎందుకు పూర్తి చేయలేదు.

  • పవన్ కళ్యాణ్ పోలవరం పూర్తి కావాలని మాట్లాడారు.

  • పోలవరం పూర్తి కాకూడదని వైసీపీ నేతలు దేవుణ్ణి ప్రతి రోజూ ప్రార్ధిస్తున్నారు.

  • అసెంబ్లీలో పోలవరం సహా అన్ని చర్చించాం.

  • అసెంబ్లీకి వచ్చి చర్చించి ఉంటే పోలవరం గురించి అన్ని విషయాలు తెలిసి ఉండేవి.

  • అసెంబ్లీకి రాకుండా అఖిలపక్షం అంటూ వైసీపీ డిమాండ్ చేయడం తగదు.

  • ఇవాళ శుక్రవారం మేము ధైర్యంగా ఆస్తులు ప్రకటించాం

  • జగన్ పాదయాత్ర ఆపి అవినీతి కేసులో ఇవాళ న్యాయస్థానానికి హాజరవుతున్నారు

  • ఈ రెండిటి కి మధ్య తేడా ను ప్రజలు గమనిస్తున్నారు

  • జగన్ ఆస్తులను సీబీఐ, ed లు ప్రకటిస్తున్నాయి

  • జగన్ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదు.

  • వై.ఎస్. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు హెరిటేజ్ పై 17కేసులు వేశారు

  • ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు.

  • పోలవరం, స్పెషల్ ప్యాకేజీ ఏపీ హక్కు.

  • కేంద్రం అసలేం చేయడం లేదనడం కరెక్ట్ కాదు.

  • కేెెంద్రానికి-రాష్ట్రానికి, టీడీపీ-బీజేపీకి మధ్య గ్యాప్ లేదు.

  • ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ, చంద్రబాబు కృషి చేశారు.

  • మెట్రో, హైటెక్ సిటీ, హెచ్ఐసీసీ ప్రాంగణం వంటివి రూపొందించింది చంద్రబాబే.

  • రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం బాధ్యతలో భాగం.

  • రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో జరిగే కార్యక్రమాలకు పిలవకపోయినా  భాదపడాల్సిన అవసరం లేదు.

  • ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం జడ్జీ ముందు చేతులు కట్టుకుని నిలబడడం జగనుకు అలవాటై పోయింది.. ఇది కొత్త విషయమేమీ కాదు.

  • అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆస్తులు ప్రకటించి విమర్శలు చేస్తే మంచిది.

  • సమస్యల పరిష్కారానికి నన్ను కలిసినందుకే ఎంపీ బుట్టా రేణుకను పార్టీ మాకుతున్నారంటూ వైసీపీనే ప్రచారం చేసింది.

  • మా నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలని ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా లేఖ రాయలేదు.

  • టీడీపీ ఎమ్మెల్యేలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంట పడతారు.

  • కాపు రిజర్వేషన్లపై తమ పార్టీ స్టాండ్ ఏంటో ఇప్పటికీ వైసీపీ నేతలు స్పష్టంగా చెప్పలేదు.

  • బోయలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేశాం… దాని గురించీ వైసీపీ ఏం మాట్లాడ్డం లేదు.