ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల షాకింగ్‌ నిర్ణయం

NTR And Trivikram Shocking Decision On New Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈనెల చివర్లో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. గత రెండు నెలలుగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుతున్న దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని కేవలం సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టార్‌ హీరోల సినిమాలు సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయడం అంటే సాధ్యం అయ్యే పని కాదు. కాని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయవచ్చు అని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. అందుకు ఎన్టీఆర్‌ కూడా తన పూర్తి సహకారాన్ని అందిస్తాను అంటూ త్రివిక్రమ్‌కు హామీ ఇచ్చాడు. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఈ చిత్రం కోసం సిద్దం అవుతున్నాడు. సినిమా సూటింగ్‌ మొదు పెట్టిన తర్వాత ఏకధాటిగా మూడు నెలల పాటు చిత్రీకరణ చేయబోతున్నారు. సినిమా షూటింగ్‌కు కావాల్సి సెట్టింగ్స్‌ నిర్మాణం అంతా కూడా జరిగిపోయింది. త్రివిక్రమ్‌ సినిమాలు అంటే చాలా రిచ్‌గా ఉంటాయి. కాని ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోతున్న చిత్రాన్ని కాస్త తక్కువ బడ్జెట్‌తో తీయాని భావిస్తున్నాడు. అజ్ఞాతవాసి ఎఫెక్ట్‌ కారణంగా ఎన్టీఆర్‌తో సినిమా విషయంలో త్రివిక్రమ్‌ చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌ విషయంలో కూడా కాస్త అతి జాగ్రత్తను వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.