పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర – రాజమండ్రి టూ రంపచోడవరం

pawan kalyan bus yatra in rampachoram

కొన్ని రోజుల ముందే రైలు యాత్ర చేసిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈసారి బస్సు యాత్ర చేయబోతున్నారు. ఈమేరకు బస్సు యాత్రకి సంబంధించిన వివరాలని తన ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలను, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులని తెలుసుకోడానికి పల్లె వెలుగు బస్సు లో పవన్ కళ్యాణ్ ప్రయాణించనున్నట్లు తెలిపారు. ఈ బస్సు యాత్రలో భాగంగా రేపు శనివారం అనగా నవంబర్ 24 న రాజమండ్రి నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతున్న పల్లె వెలుగు బస్సు, గుడాల, కోరుకొండ, గోకవరం ల వద్ద ఆగి అక్కడ ఉన్న ప్రజల సమస్యలను విని, రంపచోడవరం చేరుకుంటారు.

పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర - రాజమండ్రి టూ రంపచోడవరం - Telugu Bulletదీనికొరకు గాను జనసేన పార్టీ నేతలు కావాల్సిన ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర చేస్తున్నారు. ఎన్నికల వేళ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలుమూలలు తిరిగి, ప్రజల కష్టాలు విని, పరిష్కారం దిశగా పోరాడాలని జనసేన నేత అలుపెరుగకుండా పర్యటిస్తున్నారు. ఈ జనసేన పోరాట యాత్రల్లో భాగంగా అధికార పార్టీ పైనే కాకుండా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ నేత పైన కూడా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.