అప్పుడు బొంబాయిలో అంతే… ఇప్పుడు పల్లెటూళ్ల‌ల్లో అంతే..

Pawan Kalyan Controversy Tweets On ABN MD Radha Krishna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మీడియా సంస్థ‌ల‌పై ట్విట్ట‌ర్ యుద్ధం చేస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్… తాజాగా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ‌పై ప‌రోక్ష సెటైర్లు వేశారు. మెగాస్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు సినిమాలో అల్లురామ‌లింగయ్య చెప్పే బొంబాయిలో అంతే… బొంబాయిలో అంతే… అనే డైలాగ్ ను ఉద‌హ‌రిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక సినిమాలో విల‌న్లు త‌ప్పుడు ప‌నిచేసిన‌ప్పుడు ఎవ‌ర‌న్నా అడిగితే… ఆ ప‌క్కనున్న క‌మెడియ‌న్ పాత్ర బొంబాయిలో అంతే… బొంబాయిలో అంతే… అని అంటూ ఉంటాడు. అలాగే… ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లిని దూషించే తిట్టు ప‌ల్లెటూళ్ల‌లో చాలా స‌ర్వ‌సాధార‌ణం అంట అని ఈ బూతుర‌త్నం అంటాడు.

మ‌రి ఈ లాజిక్ ను బ‌ట్టి… ఇత‌నిని ప్ర‌జ‌లంద‌రూ అలా పిలిచినా త‌ప్పు అనుకోడు. అత‌ను స్వ‌యంగా ఒప్పుకున్న లాజిక్ ప్రకారం మీరు విచ్చ‌ల‌విడిగా, స్వేచ్ఛ‌గా బూతుర‌త్నాన్ని అలా ముద్దుగా పిలుచుకోవ‌చ్చు. పిలుచుకుంటే అత‌ను బాధ‌ప‌డ‌డు. న‌వ్వుకుంటూ… ప‌ల్లెటూళ్ల‌లో అంతే… పల్లెటూళ్ల‌లో అంతే… అని బూతు ప‌లుకు రాస్తూ కూర్చుంటాడు. కానీ అత‌ను ఇచ్చిన లైసెన్స్ అత‌ని వ‌రకే ప‌రిమిత‌మ‌వుతుందా… లేదా అనేది మ‌నం వేచి చూడాలి అని ప‌వ‌న్ ట్వీట్ చేశారు.