Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్లో ఏ రేంజ్లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కోసం ఫ్యాన్స్ ఏం చేసేందుకైనా కూడా వెనుకాడరు. అంతటి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల నుండి తప్పుకుంటాను అంటూ ఫ్యాన్స్ ఊరుకోరు. అయినా కూడా పవన్ రాజకీయాల కోసం సినిమాను కాస్త పక్కకు పెట్టాడు. వచ్చే సంవత్సరంలో ఎన్నికలున్న నేపథ్యంలో పవన్ సినిమాలను పక్కకు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడు. అయితే రాజకీయాలు చేస్తే పవన్ సంపాదించలేడు. అందుకే తనకు తెలిసిన సినిమాలోనే సంపాదించాలని పవన్ భావిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నాడు.
హీరోగా సినిమాలు చేయకుండా డబ్బులు సంపాదనకు నిర్మాతగా మారాలని పవన్ భావిస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్పై పలు చిత్రాలను నిర్మించిన పవన్ ప్రస్తుతం నితిన్తో ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది. ఆ చిత్రం తర్వాత కూడా పవన్ వరుసగా చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నాడు. సొంతంగా కాకుండా తనకు నమ్మకమైన నిర్మాతలతో సినిమాలను కలిసి నిర్మించాలనే నిర్ణయానికి పవన్ వచ్చాడు. పవన్ భాగస్వామ్యంలో సినిమాలు నిర్మించేందుకు పలువురు ఆసక్తిగా ఉన్నారు. దాంతో వరుసగా పవన్ బ్యానర్లో సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. వచ్చే సంవత్సరంలో పవన్ బ్యానర్లో చరణ్ సినిమా కూడా ఉండే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నా కూడా నిర్మాతగా సినిమాలకు దగ్గరగా ఉండేలా పవన్ ఇలా ప్లాన్ చేసుకున్నాడన్న మాట.