కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్న పవన్ కళ్యాణ్

కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్న పవన్ కళ్యాణ్

రాష్ట్ర రాజకీయాలతో బిజీగా గడుపుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రస్తుతానికి మళ్ళీ సినిమాలు చేస్తూ, రాజకీయాలకు కూడా సరైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, రాజకీయాలకు తగ్గ ప్రాధాన్యతను ఇస్తున్నారు కూడా… ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ సమావేశాలు అన్ని కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యకర్తల కోసమే ఏర్పాటు చేయడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి.

ఇకపోతే హైదరాబాద్ కి కర్నూలు జిల్లా దగ్గరగా ఉండటంతో ఈ సమావేశాలు అన్ని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనే కార్యకర్తల కోరిక మేరకు పవన్ కూడా హైదరాబాద్ లోనే సమావేశాలు నిర్వహించడానికి ఒప్పుకున్నారని సమాచారం. కాగా హైదరాబాద్ లో కర్నూలు జిల్లా కార్యకర్తలతో ఫిబ్రవరి 6, 7 తేదీల్లో సమావేశమవనున్నారు. అంతేకాకుండా 6న పాణ్యం, 7న ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసైనికులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు.