ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయడంపై స్పందించిన జీవీఎల్ హోదా అనే వ్యవస్థ లేనే లేదని అలాంటి లేని వ్యవస్థ గురుంచి జగన్ మాట్లాడితే ఆయన రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకోవలసి వస్తుందని అన్నారు.

అయితే నేడు మీడియాతో మాట్లాడిన జీవీఎల్ ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకి బదులు ప్రాజెక్టుల కోసం 22 వేల కోట్లు అదనంగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అది జగన్‌కి కూడా తెలుసని అన్నారు. అంతేకాదు ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ఉద్దేశం కేంద్రానికి లేదని జీవీఎల్ తేల్చి చెప్పేశారు.