క‌విత‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌న్య‌వాదాలు

Pawan Kalyan Thanks to MP Kavitha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విభ‌జ‌న హామీల అమలు కోసం పార్ల‌మెంట్ లో ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన టీఆర్ ఎస్ ఎంపీ క‌విత‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఒక ట్వీట్ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని లోక్ స‌భ‌లో మ‌ద్ద‌తు తెలిపిన టీఆర్ఎస్ ఎంపీ, చెల్లెలు క‌విత‌గారికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు చెబుతున్నా. అని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల్లో క‌విత మాట్లాడుతూ ఏపీకి ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల సాధ‌న కోసం ఏపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. మిత్ర‌ప‌క్షంగా ఉన్న పార్టీ ఎంపీలే ఆందోళ‌నాకార్య‌క్ర‌మాలు చేప‌డితే, దేశ ప్ర‌జ‌ల‌కు నెగ‌టివ్ మెసేజ్ వెళ్తుంద‌ని, హామీల‌ను నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేయాల‌ని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రా ఎంపీల ఆందోళ‌న‌కు తెలంగాణ ఎంపీ మ‌ద్ద‌తు తెల‌ప‌డంపై అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తంచేశారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్ర‌జ‌లంతా క‌లిసే ఉంటున్నార‌న‌డానికి ఇలాంటి ఘ‌ట‌న‌లు ఉదాహ‌ర‌ణగా నిలుస్తాయ‌న్నారు. రెండు రాష్రాల నేత‌లు క‌లిసి క‌ట్టుగా పోరాడి తెలుగుప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు ర‌క్షించాల‌ని సూచిస్తున్నారు

Pawan Kalyan Thanks to MP Kavitha