జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 వల్లే ప్రశాంత వాతావరణం: ప్రధాని మోదీ

Political Updates: Center has released tax share to states
Political Updates: Center has released tax share to states

జమ్ముకశ్మీర్​ ప్రజలు ఉగ్రనీడ నుంచి బయటపడ్డారు. ఆర్టికల్ 370 ​రద్దు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. చాలా దేశాలు తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. కానీ భారత్​లో ఆ పరిస్థితులు లేవు. వచ్చే 25 ఏళ్లు భారత్​కు చాలా ముఖ్యమైనవి. అంతలోపే భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయాలి. అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

భారత​ మొదటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా గుజరాత్​లోని ఆయన విగ్రహానికి ప్రధాని నివాళులు అర్పించారు . అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్దార్‌ వల్లభాయ్ పటేల్ అద్వితీయమైన స్ఫూర్తిని, దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞతను దేశ ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటారని మోదీ అన్నారు.

ప్రపంచం మొత్తం భారత్​ వైపే చూస్తోందని.. ఈ రోజు భారత్​ కొత్త శిఖరాలను అందుకుందని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ జీ20 నిర్వహించిన తీరుతో ప్రపంచం ఆశ్చర్యానికి గురైందని తెలిపారు. ప్రపంచంలో చాలా సంక్షోభాలు ఉన్నా.. భారత్​ సరిహద్దులు మాత్రం సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేశారు.