Political Updates: నేడు సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష…రద్దు చేస్తారా ?

TS Politics: CM Revanth Reddy gave good news to all Telangana people
TS Politics: CM Revanth Reddy gave good news to all Telangana people

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో దూకుడు పెంచారు. ప్రతి రోజూ రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా ధరణిపై ఫోకస్‌ చేశారు. ధరణిపై నేడు మధ్యాహ్నం సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇక అటు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి కొత్త క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు స్థలాలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి క్యాంప్‌ ఆఫీస్‌ లేదు. ఆయన జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. అక్కడ క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.