ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే

Pooja Hegde to acts as Heroine in NTR Trivikram
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్ర‌స్తుతం తెలుగులో పూజాహెగ్డే టైం న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. బాలీవుడ్ మొహంజదారో సినిమా కోసం రెండు సంవ‌త్స‌రాల పాటు కాల్షీట్లు కేటాయించి… ఆ ఫ‌లితంతో నిరాశ‌లో ఉన్న‌ పూజాహెగ్డేను టాలీవుడ్ మ‌రోమారు సాద‌రంగా ఆహ్వానించింది. రీ ఎంట్రీలో ఆమెకు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే దువ్వాడ జ‌గ‌న్నాథంతో ఓ మంచి హిట్ కొట్టిన పూజాహెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల ల‌క్కీ ఛార్మ్ గా మారింది. మ‌హేశ్ బాబు 25వ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరే వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో రూపొంద‌నున్న మూవీలో కూడా పూజా హెగ్డే క‌థానాయిక‌గా ఎంపిక‌యిన‌ట్టు తెలుస్తోంది. చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌నుంది. హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి రెండవ వారంలో మొద‌లుకానుంది. ప్ర‌స్తుతం పూజ బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా సాక్ష్యం సినిమాలో న‌టిస్తోంది.