జగన్ తో భేటీ అయిన పోసాని….అందుకేనా ?

posani krishna murali meets jagan mohan reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఇటీవల కాలంలో వివిధ అంశాలపై స్పందిస్తూ తెలుగుదేశం పార్టీపై నటుడు పోసాని తీవ్రంగా ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. నంది అవార్డుల విషయంలో, అలాగే ప్రత్యేకహోదా పోరాటం విషయంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారాయన. ముక్కుసూటిగా మాట్లాడే పోసాని కృష్ణమురళి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలైనా రాజకీయాలైనా నిక్కచ్చిగా మాట్లదేస్తుంటారు. అయితే ఆ మధ్య కాలంలో జగన్, పవన్ లలో ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారని ఓ ఇంటర్వ్యులో జర్నలిస్టు ప్రశ్నించగా.. జగన్ కే ఎక్కువ మార్కులు వేస్తానని ప్రకటించారు ఆయన స్పందించారు.

తనను ఎవరెంత ప్రలోభపెట్టినా.. డబ్బు, పదవి ఆశ చూపినా.. ఏం చేసినా సరే.. తన ఓటు మాత్రం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికేనని కుండ బద్దలు కొట్టారు. తానంతట తాను వెళ్లి జగన్ ని వెళ్లి కలవను, వాళ్ళంతట వాళ్ళు పిలెస్తే తప్ప అని ప్రకటించిన ఆయన ఇప్పుడు వెళ్లి జగన్ ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తుంది. అయితే అదే ఇంటర్వ్యూలో తాను ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభకు కానీ ఒప్టీ చేయను కేవలం జగన్ కు మద్దతు ఇస్తానని అన్న ఆయన నిజంగానే మద్దతు ప్రకటించేందుకు వెళ్ళారా లేక 2019 లో ఎక్కడనుండైన పోటీ చేస్తారా ? అనే విషయం తెలియాల్సి ఉంది