చుట్టు తిరిగి మళ్లీ అనుష్క వద్ద ఆగిన ‘సాహో’

prabhas-new-movie-sahoo-her

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటించబోతున్న సినిమా ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘రన్‌ రాజా రన్‌’ ఫేం సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా నేటి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్‌లో ప్రభాస్‌తో పాటు అనుష్క కూడా పాల్గొనడం, షూటింగ్‌ స్పాట్‌లో అనుష్క కూడా కనిపించడంతో ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్క నటిస్తుందనే క్లారిటీ వచ్చేసింది.

‘సాహో’ సినిమా కోసం బాలీవుడ్‌లో దాదాపు పది మంది హీరోయిన్స్‌ను సంప్రదించడం జరిగింది. కాని ఒక్క హీరోయిన్‌ కూడా ‘సాహో’కు ఫిక్స్‌ కాలేదు. కొందరు భారీ పారితోషికం డిమాండ్‌ చేయగా మరి కొందరు ఏవో కండీషన్స్‌ పెట్టడం, మరి కొందరు ప్రభాస్‌కు నచ్చక పోవడం జరిగింది. దాంతో సౌత్‌లో కూడా కొందరు హీరోయిన్స్‌ను ప్రభాస్‌ కోసం పరిశీలించారు. దాదాపు రెండు నెలలుగా ఈ అన్వేషణ తారా స్థాయిలో జరిగింది. కాని ఏ ఒక్క హీరోయిన్‌ కూడా ఫిక్స్‌ కాలేదు. దాంతో చేసేది లేక ప్రభాస్‌కు జోడీగా చివరకు అనుష్కనే ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. ‘మిర్చి’, ‘బాహుబలి’ రెండు పార్ట్‌లలో వీరిద్దరు కలిసి నటించారు. వీరు నటించిన సినిమాలు సక్సెస్‌ అవ్వడంతో మరోసారి వీరిద్దరి జత కలిసింది. అనుష్క, ప్రభాస్‌ల రొమాన్స్‌ను ఫ్యాన్స్‌ కూడా ఇష్టపడుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే సంవత్సరం ఆరంభంలో ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.