ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలే మేలట ! : శ్రీమాన్ బీజేపీ ఎమ్మెల్యే ఉవాచ

Prostitutes Better Than Government Officials says BJP MLA Surendra Singh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఒకపక్క మోడీ-షా లు మైనారిటీలో పడ్డ బీజేపీని జాగ్రత్తగా చూసుకోవడానికి మిత్రపక్షాల వెంట పది ఆపసోపాలు పడుతుంటే పాపం ఇవేవీ పట్టని బీజేపీ నేతలు తమకు అచ్చొచ్చిన స్టైల్ లోనే వివాదాస్పద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ కాలం గడుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. సీఎం అయ్యింది మొదలు. పిచ్చి వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలిచినా త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ ను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో ఆనాటి నుండి బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు పురాణాలతో టెక్నాలజీ లింక్ పెట్టి కామెడీ చేస్తుంటే మరి కొందరు మాత్రం తమ నోటి దురద వల్ల చిక్కుల్లో పడుతున్నారు.

బిహార్ లోని బైరియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ ఇటీవల తరుచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ… వార్తలోకి ఎక్కడం హాబీగా మారింది. తాజాగా మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులకంటే ప్రాస్టిట్యూట్లు (వేశ్యలే) నయమని శ్రీ మాన్ సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లే నయం. కనీసం వారు డబ్బులు తీసుకుని పని అయినా చేస్తారు. స్టేజీలపై డ్యాన్స్‌లు చేస్తూ.. మనల్ని సంతోష పరుస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటారు. పని చేస్తారో చేయరో గ్యారెంటీనే లేదు అని వ్యాఖ్యానించారు. మరో కొసమెరుపు ఏంటంటే లంచాలు అడిగిన ప్రభుత్వ అధికారులను అక్కడే చెప్పులతో కొట్టండి అంటూ ఆయన మద్దతుదారులను ఆదేశించారు కూడా.

బైరియా తహసీల్దార్‌ ఆఫీసులో అధికారులు లంచాలు అడిగారనే ఆరోపణల మీద తన మద్దతుదారులతో కలిసి ‘వార్నింగ్‌ డే’ ను నిర్వహించారు. ఈ సందర్భంగా లంచాలు అడిగిన అధికారుల వాయిస్‌లను కూడా రికార్డు చేయాలని మద్దతుదారులను కోరారు ఎమ్మెల్యే. అయితే అధికారుల మీద తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌, ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేశానని, వారి సంక్షేమం కోసం తాను జైలుకి వెళ్లడానికైనా సిద్దమని ప్రకటించారు ఆయన. సురేంద్ర సింగ్‌ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకముందు కూడా దేశంలో అత్యాచార ఘటనలు పెరగడానికి కారణం తల్లిదండ్రులేనని, వారి పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అసలు ఆడపిల్లలను స్వేచ్ఛగా తిరగకుండా కట్టడి చేయాలన్నారు. పదిహేనేళ్ల పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి కాపలా కాయాలని, అలా కాకుండా వారిని ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. తన సొంత పార్టీకి చెందిన యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంపై కూడా ఆయన మండిపడ్డారు. కొంతమంది మంత్రులను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తీసేయాలని, లేదంటూ యూపీలో పతనం తప్పదని హెచ్చరించారు.