మఠాలు ఎక్కడ అని రాహుల్ వాకబు.

Rahul Gandhi Political Planning On 2019 Elections,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పరువు నిలబెట్టుకుంది కాంగ్రెస్. ఇక ఆ పార్టీకి కొత్తగా సారధ్య బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి కూడా పోరాట వీరుడనే గౌరవం దక్కించిన ఫలితం అది. అదే ఊపు కొనసాగించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు మఠాలు, పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఆరా తీస్తున్నాడు. వాటిని ఓ చుట్టు చుట్టడానికి రెడీ అవుతున్నాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితానికి , మఠాలు చుట్టూ తిరగడానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నాం.

rahul-gandhi-master-plans

2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టిపెట్టిన రాహుల్ ఈ లోపే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి కాదు అన్న సందేశం ఇవ్వాలని గట్టిగా భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అది ముస్లిం , క్రైస్తవ అనుకూల పార్టీ అన్న బీజేపీ ప్రచారం కారణమని 10 జన్ పథ్ భావిస్తోంది. ఆ ఇమేజ్ చట్రం నుంచి బయటపడితే గానీ వచ్చే ఎన్నికల్లో గెలవలేమని రాహుల్ కి తెలుసు. అందుకే గుజరాత్ ఎన్నికల సమయంలో తాను శివభక్తుణ్ణి అని చెప్పుకున్న రాహుల్ అక్కడ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ ఆలయాలు సందర్శించారు. ఆ ప్రభావం గుజరాత్ ఎన్నికల్లో ఎంతోకొంత సానుకూలత తెప్పించిందని భావిస్తున్న రాహుల్ టీం రానున్న ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

rahul-gandhi,

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకో సారి బీజేపీ ,కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. అక్కడ శైవ ప్రభావం ఎక్కువ. మఠాలు,పీఠాలు కూడా ఎక్కువే. అందుకే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సాధ్యమైనంత ఎక్కువగా మఠాలు,పీఠాలు దర్శించే విధంగా రాహుల్ పర్యటన మార్గాన్ని ఖరారు చేస్తున్నారు. ఈ ట్రిప్ లో ప్రచారంతో పాటు ఆయా మఠాలు,పీఠాలు రాహుల్ సందర్శిస్తారు. కర్ణాటకలోని ప్రముఖ శృంగేరి పీఠ దర్శనంతో ఆయన ప్రచార పర్వం మొదలయ్యే అవకాశం ఉందట. మొత్తానికి ముల్లుని ముల్లుతోనే తీయాలనే ఓ పాత సామెత ని వ్యూహంగా మార్చుకుని హిందూ కార్డు ప్రయోగిస్తున్న బీజేపీ కి అదే హిందుత్వతో జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్