“ఒక్క క్షణం”గీతా ఆర్ట్స్ నుంచి వస్తే హిట్ .

reason behind ‘Okka Kshanam’ low-collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు శిరీష్ తన కెరీర్ ని గాడిలో పెడుతుందని నమ్మి చేసిన సినిమా “ఒక్క క్షణం “. ఈ సినిమా కోసం అతను ఏడాదికి పైగానే ఖాళీగా వున్నాడు. అంత నమ్మి చేసిన సినిమా “ఒక్క క్షణం “ గురించి రివ్యూ లు బాగానే వచ్చాయి. సినిమా టాక్ కూడా ఓకే. కానీ వసూళ్లే వాటికి తగ్గట్టు లేవు. సినిమాకి ఓ మోస్తరు టాక్ వస్తేనే హిట్ సినిమాగా మలిచే సత్తా గీతా ఆర్ట్స్ టీం దగ్గర వుంది. గతంలో దీనికి చాలా ఉదాహరణలు వున్నాయి. డివైడ్ టాక్ వచ్చిన సరైనోడు కి కూడా అప్పట్లో గీతా ఆర్ట్స్ ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందో చూసాం. అలాంటి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కొడుకు శిరీష్ సినిమా పబ్లిసిటీ లోపం కారణంగా అనుకున్న స్థాయిలో ఆడకపోవడం ఆశ్చర్యమే. 

నిజానికి అల్లు అరవింద్ కూడా కొడుకు లాగానే ఒక్క క్షణం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంత బిజీ షెడ్యూల్ లో కూడా రిలీజ్ రోజు పొద్దున్నే ప్రసాద్ ఐ మాక్స్ కి వచ్చి యూనిట్ తో పాటు సినిమా చూసారు. ఇక సినిమా అయ్యాక బాగా పాజిటివ్ గా మాట్లాడారు. మెగా స్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా విడుదల అయ్యాక శిరీష్ ని పిలిచి అభినందించారన్న వార్త బయటికి వచ్చింది. నిజంగా సినిమా కూడా బాగానే వుంది. ఇన్ని సానుకూల అంశాలు పెట్టుకుని కూడా ఓ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా అనుకున్న స్థాయికి వెళ్లకపోవడంతో ఎక్కడో తేడా అనిపిస్తోంది. ఇదే ఫీల్ అవుతున్నారంట ఈ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. ఇదే సినిమా గీతా ఆర్ట్స్ నుంచి కచ్చితంగా హిట్ అయ్యేది అని ఒక్క క్షణం నిర్మాత సన్నిహితుడు ఒకరు కామెంట్ చేయడం పాజిటివ్ అనుకోవడానికి వీల్లేదు.