హైదరాబాద్ కి రాహుల్…రెండ్రోజులు ఇక్కడే…!

Rahul Gandhi To Visit Hyderabad On Two Day

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈరోజు రేపు రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీకి చెందిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష్యుడి హోదాలో తొలిసారి రాహుల్ తెలంగాణలో పర్యటిస్తుండడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. ఆయన రాక సందర్భంగా శంషాబాద్ వద్ద భారీ ఎత్తున స్వాగత ఫ్లెక్షీలు, బ్యానర్లు ఏర్పాటు చేసాయి.

Rahul Gandhi To Visit Hyderabad On Two Day

రాహుల్ పర్యటన వివరాలు :

సోమవారం మధ్యాహ్నం రాహుల్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. పర్యటనలో భాగంగా మహిళా సంఘాలతో భేటీకానున్నారు.

సాయంత్రం శేరిలింగంపల్లి బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి హోటల్‌ హరితప్లాజాలో రాహుల్‌ బస చేస్తారు.

మంగళవారం ఉదయం బూత్‌ కమిటీల అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు.

తర్వాత సీనియర్‌ నేతలతో,ఎడిటర్లతో,పారిశ్రామికవేత్తలతో వివిధ సమయాల్లో వేర్వేరుగా సమావేశమవుతారు.

మధ్యాహ్నం గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించి సాయంత్రం విద్యార్థులు, యువజన సంఘాలతో సమావేశం కానున్నారు.

సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌లో రాహుల్‌గాంధీ సభ జరగనుంది.

తిరిగి రాత్రి 7.30 గంటలకు రాహుల్‌ తిరిగి ఢిల్లికి వెళ్లనున్నారు.