ఈ యేడాదిలోనే రాదట!

Robo 2.0 Movie Release Again Postponed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి అనే విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో సినిమా ‘2.0’. ఈ చిత్రం గత రెండున్న మూడు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఊరిస్తూ వస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రోబోకు సీక్వెల్‌ అనే విషయం తెల్సిందే. గత సంవత్సరం నుండి సినిమా విడుదల అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. ఇటీవలే ఈ చిత్రం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే మరోసారి ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతుంది. సినిమాకు దాదాపు 175 కోట్ల రూపాయల గ్రాఫిక్స్‌ వర్క్‌ జరపాల్సి ఉందని, భారీ ఎత్తున విజువల్‌ ఎఫెక్ట్‌ షాట్స్‌ ఉన్న కారణంగా ఈ ఆలస్యం అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

రోబో సంచలన విజయాన్ని సాధించిన నేపథ్యంలో దానికి మించేలా శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పూర్తి హాలీవుడ్‌ స్థాయి సినిమాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతుంది. హాలీవుడ్‌లో ఎక్కువగా విడుదల చేయాలని భావిస్తున్న శంకర్‌ ఆ స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే సినిమా ఇంత ఆలస్యం అవుతుందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే సంవత్సరం వరకు విడుదల చేయలేమని చిత్ర యూనిట్‌ సభ్యులు తేల్చి పారేశారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం అయినా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారో లేదో చూడాలి.