మళ్లీ ఫ్యాన్స్‌ను నీరు గార్చిన రజినీ

Rajinikanth said there was no political statement tomorrow

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాన్న పులి కథ అందరికి తెలిసే ఉంటుంది. ఆ కథలో కుర్రాడు పులి రాకున్న కూడా తండ్రిని నాన్న పులి అంటూ మళ్లీ మళ్లీ మోసం చేస్తాడు. చివరకు ఏం జరుగుతుందో అందరికి తెల్సిందే. ఇప్పుడు అదే తరహాలో రజినీకాంత్‌ రాజకీయ ఎంట్రీ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రజినీకాంత్‌ రాజకీయం గురించి చర్చ జరుగుతుంది. ఇక సంవత్సరం నుండి రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. రజినీకాంత్‌ చేస్తున్న పనులు, ఆయన సన్నిహితులు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వెళ్లినట్లే అనుకోవచ్చు. ఫ్యాన్స్‌తో మీటింగ్‌ ఏర్పాటు చేసి రాజకీయ ఎంట్రీ గురించి ప్రకటించబోతున్నాడు అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి.

అప్పుడు ఫ్యాన్స్‌ మీట్‌లో మరోసారి ఫ్యాన్స్‌ను కలిసి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు రజినీకాంత్‌ ఫ్యాన్స్‌తో భేటీలో పాల్గొంటున్నాడు. తమిళనాడులోని అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ చెన్నైకు వస్తున్నారు. వారితో రజినీకాంత్‌ భేటీ అవుతున్నాడు. డిసెంబర్‌ 31న కీలక ప్రకటన రాబోతుంది అంటూ జాతీయ మీడియా నుండి గల్లీ మీడియా వరకు ప్రచారం చేసింది. కాని తాజాగా రజినీకాంత్‌ మరోసారి ఫ్యాన్స్‌ అంచనాలను నీరు గార్చాడు. రేపు రాజకీయ ప్రకటన లేదని తేల్చి పారేశాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత రాజకీయాల గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం రజినీకాంత్‌ ‘కాల’, ‘2.0’ చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రాలు వచ్చే సంవత్సరంలో విడుదల అవ్వనున్నాయి. ఆ తర్వాత రజినీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఉంటుందేమో చూడాలి.