బాబును తిరస్కరించారు… మా జైత్రయాత్ర మొదలైంది !

Ram Madhav comments on Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ తో బీజేపీ శ్రేణులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బుఅవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. “కర్ణాటకలోని తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటు వేయకుండా చేసేందుకు చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అన్ని రకాల వ్యూహాలను పన్నారు. కానీ, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ ఘన విజయం సాధించింది. మా స్థానాలను 6 నుంచి 20కి పెంచుకున్నాం. చంద్రబాబు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. దక్షిణాదిపై ఆధిపత్యం సాధించే దిశగా మా ప్రయాణం మొదలైంది” అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ram Madhav on Chandrababu