పని అమ్మాయితో యజమాని.. ఆపై వ్యభిచారం.. గ్యాంగ్ రేప్

Gangsters don't leave HIV victim ... gang rape

పనుల కోసం పలు రాష్ట్రాల నుంచి పల్లెల నుంచి జనాలు పట్టణాలకు వస్తుంటారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఉత్తరాది రాష్ట్రం నుంచి తమిళనాడుకు వచ్చిన ఓ యువతి కామాంధుల చేతిలో చిక్కి అల్లల్లాడిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఓ యువతిని ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను కారులో నుంచి తోసేసి పారిపోయారు. దీంతో బాధితురాలి మెల్లిగా పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు వాంగ్మూలంలో ఆ ఘటనకు ముందే యజమాని చేతిలో దారుణంగా మోసపోయిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

అయితే ఉత్తరాది నుంచి ఓ కుటుంబం కర్ణాటకలోని బెంగళూరుకు వలస వచ్చింది. వారికి ఓ కూతురు ఉంది. ఓ ఇంట్లో పనిచేసేందుకు ఆమె ఐదు నెలల క్రితం తమిళనాడులోని తంజావూరుకు వెళ్లింది. అయితే ఆమె పనిచేసే ఇంటి యజమాని సెంథిల్‌కుమార్‌ ఆమెను లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడు. అలా కొద్దిరోజుల గడచిన తర్వాత ఆ యువతిని వ్యభిచార వృత్తిలోకి దించాడు. విటులను తీసుకొచ్చి ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. దీంతో అతడి బారి నుంచి తప్పించు కోవడానికి అనేకమార్లు బాధితురాలు ప్రయత్నించి  విఫలమైంది.

తాజాగా ఆదివారం రోజు రాత్రి ఆ కిరాతకుడి బారి నుంచి తప్పించుకుంది. అలా బయటకు వచ్చిన ఆ యువతి రోడ్డు పక్కన నిద్రిస్తుంది. ఆమెను గమనించి ముగ్గురు యువకులు కారులోకి బలవంతంగా ఎక్కించుకొని గ్యాంగ్ రేపు చేశారు. అలా అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాధితురాలిని సానూరపట్టి కడై వీధి వద్ద పడేసి వెళ్లిపోయారు. ఇక సోమవారం ఉదయం యువతిని గమనించిన మహిళా సంఘాల ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అప్రమత్తమైన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక మంగళవారం రాత్రికి స్పృహలోకి వచ్చిన ఆ యువతి నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.