Crime: కాంచీపురం జిల్లాలో 1400 కిలోల బంగారం స్వాధీనం

Crime: 1400 kg gold seized in Kancheepuram district
Crime: 1400 kg gold seized in Kancheepuram district

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. శ్రీపెరుంబుదూర్-కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయిం గ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేశారు.

ఓ లారీలో1000 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుం బుదూర్ సమీప మన్నూర్లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేనట్లు తెలిసింది. అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులను సంప్రదించారు.