పెన్షన్ కోసం వెళ్తే రేప్ చేసిన ఎమ్మెల్యే !

Rape Case Filed On AAP MLA

ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం అది కూడా సహ్య సమాజనం తలదించుకునేలా రెప కేసు నమోదు కావడం సంచలనం రేపింది. ఓ మహిళపై అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు అందిన కారణంగా ఢిల్లీలోని రితాలా నియోజకవర్గ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్‌ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పింఛన్ మంజూరు చేయించమని అడగటానికి తను వెళ్తే అక్కడి ఎమ్మెల్యే తన కార్యాలయంలోనే తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రశాంత్ విహార్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ప్రశాంత్ విహార్ పోలీసులు ఎమ్మెల్యేపై ఐపీసీ 376, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును ఢిల్లీ మహిళా పోలీస్ సెల్‌కు బదిలీ చేశారు. పెన్షన్ కోసం వచ్చిన మహిళ మీద ఎమ్మెల్యే గోయల్ అత్యాచారానికి పాల్పడినట్లు గతేడాది డిసెంబరులో పెద్దయెత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయితే జనవరి నెలలో తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు. రేప్ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీని మీద ఆప్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.