సినీ రంగాన్ని అటు నుంచి నరుక్కొస్తున్న టీడీపీ సర్కార్.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంది అవార్డుల వ్యవహారం ఇంత రచ్చ అవుతుందని ఏ మాత్రం ఊహించని టీడీపీ సర్కార్ అవాక్కయ్యింది. పోసాని లాంటి వాళ్ళు లోకేష్ ని పట్టుకుని తాగి మాట్లాడుతున్నావా అని ప్రశ్నించేసరికి ఇటు చంద్ర బాబు, అటు బాలయ్య బాబు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారంట. నందుల అంశం ఇంత వివాదం కావడం వెనుక ఎవరు వున్నారో తెలుసుకున్నారట. మొత్తం వ్యవహారం ఓ సీనియర్ నిర్మాత కనుసన్నల్లో జరిగినట్టు నిర్ధారణకు వచ్చారట. చిత్ర పరిశ్రమలో తన పెత్తనం సాగడం లేదన్న కసితో ఆయన ఈ పనికి పూనుకున్నట్టు తెలిసిందింట. ఇప్పుడు పోసాని ఏ బోయపాటికి అవార్డు వచ్చిందని రగిలిపోతున్నాడో ఆ అవార్డు కోసం గట్టిగా సిఫార్సు చేసింది కూడా ఆ అగ్ర నిర్మాత అట. బోయపాటికి అవార్డు ఇచ్చాక పోసానిని రెచ్చగొట్టడంలో కూడా ఆయన హస్తం ఉందట. ఈ గుట్టుమట్లు ఇప్పుడిప్పుడే తెలుసుకున్న బాబు ఇంకో రూట్ లో ఆ నిర్మాత తో పాటు మరికొందరు సినీ పెద్దలకు షాక్ ఇచ్చేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీ సర్కార్ మీద నందుల అంశంలో కొందరు దాడి చేయడానికి వారికి వున్న ఆర్ధిక బలం ప్రధాన కారణం అని టీడీపీ సర్కార్ గుర్తించిందట. సినీ రంగంలో ఆయువుపట్టు లాంటి డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్ రంగాన్ని చేతుల్లో పెట్టుకుని సినిమాల జయాపజయాలను నిర్దేశించే స్థాయికి వచ్చిన ఆ నిర్మాత వల్ల దెబ్బ తిన్న చిన్న సినిమాల నిర్మాతలు కొందరు బాబు దగ్గరకు వెళ్లి అక్కడ జరిగే అక్రమాల గురించి పూస గుచ్చినట్టు వివరించారట. ఆ అక్రమాలకు, నియంతృత్వానికి బ్రేకులేస్తే అంతా కంట్రోల్ లోకి వస్తుందని ఆ చిన్న నిర్మాతలు చెప్పిన ప్రతిపాదనల మీద గట్టిగా వర్కౌట్ చేస్తోందట బాబు సర్కార్. కొత్త నియమాలతో వచ్చే మార్పులు సదరు బడా నిర్మాతకు చుక్కలు కనిపిస్తాయి అంటున్నారు. అప్పుడు ఆ బడా నిర్మాత గొడుగు కింద చేరి రెచ్చిపోయే వారికి కూడా బాగానే షాక్ తగులుతుంది. మొత్తానికి అటు నుంచి నరుక్కొస్తున్న టీడీపీ ప్లాన్ అనుకున్న ఫలితం వస్తుందో, రాదో చూడాలి.

nandi-award-and-tdp