టీడీపీ ఎంపీ మాగంటి బాబుకి గుండెపోటు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 పశ్చిమ గోదావరి జిల్లా చింతల పూడిలో సైకిల్‌ యాత్రలో పాల్గొంటోన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను టీడీపీ కార్యకర్తలు, కుటుంబసభ్యులు హుటాహుటిన ఏలూరులోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు వల్లనే మాగంటి బాబు పడిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం మాగంటి బాబుకి పాథమిక చికిత్స అందించామని, ఆయనకు స్వల్ప గుండెపోటు వచ్చిందని వైద్యులు ప్రకటించారు. మరి కొద్ది నిముషాల్లో మాగంటి బాబును మెరుగయిన చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. సైకిల్ యాత్రలు మొదలు పెట్టింది మొదలు తరుచూ అపశ్రుతులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం సైకిల్‌ యాత్రలో పాల్గొన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావుకు ఆక్సిడెంట్ అయి గాయాలపాలవ్వగా, ఏపీ ప్రభుత్వ చీఫ్ వీప్ మాజీ పల్లె రఘునాథరెడ్డికి కూడా గాయాలయ్యాయి.