నాగ్ అశ్విన్ ప్రభాస్ నే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం

నాగ్ అశ్విన్ ప్రభాస్ నే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం

తాజాగా ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేయనున్నారని ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ చిత్రానికి ప్రభాస్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో దర్శకుడు నాగ్ అశ్విన్ వివరించారు.

అయితే ఈ తాను రాసుకున్న పాత్రకు ఒక్క ప్రభాస్ తప్ప సినిమా ఇండస్ట్రీలోనే మరో హీరో సరిపోరని నాగ్ అశ్విన్ తెలిపారు. బడ్జెట్ పరంగా మాత్రమే కాకుండా, ఆ పాత్రని పోషించగలిగే సత్తా ప్రభాస్ కి తప్ప మరెవరికి లేదని అన్నారు. అయితే సై- ఫై కథాంశం తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదని తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాలని మెప్పించే కమర్షియల్ హంగులతో ఉండనున్నది అని తెలిపాడు.

కథ చెప్పేప్పుడు ప్రభాస్ చాల ఎక్సయిట్ అయ్యారన్న నాగ్ అశ్విన్, ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ కూడా చాల ఉంటాయని తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరకు మొదలు కానుందని, వచ్చే ఏడాది చివరికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఈ చిత్రం దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది.