రిపబ్లిక్ టీవీ సర్వే లో వైసీపీ కి భారీ విజయం …కానీ జగన్ కి నవ్వెక్కడ?

Republic TV survey Over Elections In AP

నిజాయితీ లేని పనులు చేస్తూ వాటిని నమ్మించడానికి చేసే ప్రయత్నాలు నవ్వులపాలు అవుతాయి అనడానికి తాజాగా రిపబ్లిక్ టీవీ విడుదల చేసిన సర్వే ఫలితాలు ఓ పెద్ద ఉదాహరణ. జాతీయ స్థాయిలో తమ వ్యతిరేక మీడియాని భయపెడుతూ , భజన చేసే వారిని ప్రోత్సహిస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఆ కోవలో బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న రిపబ్లిక్ టీవీ నడుస్తోంది అన్న విమర్శలు వస్తున్నప్పటికీ ఆ సంస్థ పెద్దగా పట్టించుకోవడం లేదు. మోడీకి కొమ్ముకాయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది. ఆ టీవీ తాజాగా సి ఓటర్ సంస్థతో కలిసి సర్వే చేశామంటూ కొన్ని ఫలితాలు విడుదల చేసింది.

YSRCP And BJP

ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని తేల్చేసింది. 41 శాతానికి పైగా ఓట్లతో వైసీపీ వచ్చే ఎన్నికల్లో మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను 21 గెలుచుకుంటుంది. టీడీపీ కి కేవలం 31 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని రిపబ్లిక్ టీవీ చెప్పింది. సరే నమ్ముదాం అనుకుంటే అదే సర్వే లో బీజేపీ కి ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా 12 .5 శాతం ఓట్లు , కాంగ్రెస్ కి 7 .5 శాతం ఓట్లు వస్తాయని చెప్పడం చూసి రాజకీయ అనుభవం ఉన్నవాళ్లే కాదు సామాన్యులు కూడా నవ్వుకుంటున్నారు. బీజేపీ కి ఏపీలో 12 శాతానికి పైగా ఓట్లు అంటే ఎవరి మాట ఏమో గానీ ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు. ఇక ఈ సర్వే తీరు చూసాక మనస్ఫూర్తిగా జగన్ కూడా నవ్వుకోలేకపోతున్నారు. ఎందుకంటే అది ఓ జోక్ సర్వే అని ఆయనకు తెలుసు. జోక్ కి కూడా నవ్వలేని పరిస్థితి వచ్చిన జగన్ ని చూసి జనం మాత్రం జాలిపడుతున్నారు.