పంత్ ఎట్ ధోనీ హోమ్

పంత్ ఎట్ ధోనీ హోమ్

భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తో కలిసి ఉన్న ఫొటోని పంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఫోటో వైరల్ అయి పోస్ట్ చేసిన గంటలోనే 1.98లక్షల లైకులు వచ్చాయి. రాంచీలోని ధోని నివాసంలో ఇద్దరి కలిసి గార్దెలో కూర్చుకుని దిగిన ఫోటోకి “గుడ్ వైబ్స్ ఓన్లీ” అని క్యాప్షన్‌ పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోపైన నెటిజెన్స్ “శునకంతో ఏం చెబుతున్నావ్ పంత్‌” అని “ధోనీ నుండి బాగా సలహాలు బాగా తీసుకో” అని కామెంట్‌ చేశారు.

ఇప్పటి వరకి భారత్ జట్టు తరఫున రిషప్ పంత్‌ 11 టెస్టులు 12 వన్డేలు 20 టీ20లు ఆడగా టెస్టుల్లో 754 వన్డేల్లో 229 టీ20ల్లో 325 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌ లకు సెలక్షన్‌ కమీటి రిషభ్‌ పంత్‌న జట్టులో ఉన్నా కూడ రెగ్యులర్‌ బ్యాట్స్‌ మన్‌ వికెట్‌ కీపర్‌గా శాంసన్‌ను తీస్కోవడం జరిగినది. ధోనీ వారసుడిగా పేరు సంపాదించిన రిషప్ పంత్‌ ప్రతిభకు తగ్గ ప్రదర్శన చేయలేక పోయే సరికి పెవిలియన్‌కు చేరుతున్నాడు. బంగ్లాదేశ్‌ సిరీస్‌కు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ మన్‌ సంజూ శాంసన్‌ బంగ్లాదేశ్‌ సిరీస్‌కు ఎంపిక కాగా జట్టులో చోటు పొందడానికి పంత్‌ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.