కర్నూలులో యువకుడి నరబలి…తల, మొండెం వేరుగా!

ritual murder in kurnool

కర్నూలు జిల్లాలో ఓ యువకుడి నరబలి కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా సిరివెళ్ల సమీపంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించింది. యువకుడిని నరికి తల, మొండెం వేరు చేసిన స్థితిలో ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక నరసింహ స్వామి దేవాలయం సమీపంలో ఈ ఘటన జరగడంతో గుప్త నిధుల కోసం యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బలిచ్చినట్లుగా ప్రజలలలో ప్రచారం జరుగుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. యువకుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.