మహేష్‌బాబు విజయవాడ వెళ్లడం లేదట!

Rumors of Mahesh Babu Going To Indian Navy Function

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం ‘భరత్‌ అను నేను’ చిత్రంను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకే అన్ని పనులు పక్కకు పెట్టి కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అను నేను చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సమయంలోనే మహేష్‌బాబు విజయవాడకు రాబోతున్నాడని, ఇండియన్‌ నావి ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో మహేష్‌బాబు ప్రత్యేక అథితిగా హాజరు కాబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో గుప్పుమంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలోనే మహేష్‌బాబు పీఆర్‌ టీం ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.

మహేష్‌బాబు విజయవాడకు వెళ్లనున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, ప్రస్తుతం భరత్‌ అను నేను చిత్రం పూర్తి చేసే పనిలో మహేష్‌బాబు ఉన్నారని, ఆయన్ను నావి కార్యక్రమానికి కూడా ఏ ఒక్కరు ఆహ్వానించలేదు అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పుకార్లు పుట్టించే సమయంలో కాస్త సంప్రదించాల్సిందిగా మహేష్‌బాబు పీఆర్‌ టీం కోరింది. ‘భరత్‌ అను నేను’ చిత్రం పూర్తి అయిన వెంటనే మహేష్‌బాబు తన 25వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా ఆ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మహేష్‌బాబు ఈ రెండు చిత్రాలతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.