ఆరు నెలల బ్రేక్‌ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు..!

Sai Dharam Chitralahari Regular Shooting From Nov 12th

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వరుసగా అట్టర్‌ ఫ్లాప్‌లు పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో దాదాపు ఆరు నెలల పాటు కెమెరాకు పూర్తి దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ గ్యాప్‌లో తన బాడీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నటనను మెరుగు పర్చుకున్నాడు. అదే సమయంలో పెద్ద ఎత్తున కథలు విన్నాడు. ఎన్నో కథలు విన్న మెగా హీరో ఎట్టకేలకు ‘చిత్రలహరి’ అనే చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడం, పూజా కార్యక్రమాలు జరుపుకోవడం కూడా అయ్యింది. అయితే సినిమా చిత్రీకరణ మాత్రం ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభంకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా వెలువడినది.

Sai Dharam and kishore tirumala

టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సాయి దరమ్‌ తేజ్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘చిత్ర లహరి’ చిత్రం షూటింగ్‌ ను ఈ నెల 12 నుండి జరుపబోతున్నారు. ఈ చిత్రంను తక్కువ బడ్జెట్‌లో ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌ను ఏకథాటిగా 40 రోజుల పాటు చేయబోతున్నారు. ఆ షెడ్యూల్‌లోనే సినిమాకు సంబంధించిన దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మిగిలి ఉన్న 40 శాతం చిత్రీకరణను రెండు షెడ్యూల్స్‌లో మరో నెల రోజుల్లో పూర్తి చేస్తారట. మొత్తంగా ఈ చిత్రంను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తేజూకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ లు నటిస్తున్నారు.