అలా ఎప్పటికి చేయను : సాయి పల్లవి

Sai Pallavi Says I Won't Do Premam Malar Role Again

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మలయాళ ‘ప్రేమమ్‌’ చిత్రంతో నటిగా నిరూపించుకున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి తాజాగా తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ‘ఫిదా’ చిత్రంలో సాయి పల్లవి పాత్ర అందరి కంటే, అన్నింటి కంటే ఎక్కువ మార్కులు సాధించిందని చెప్పుకోవచ్చు. సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించి మెప్పించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. మొత్తానికి సాయి పల్లవి తెలుగులో పాతుకు పోయేలా కనిపిస్తుంది. ఇక తాజాగా ఈమె ఒక విషయంపై క్లారిటీ ఇచ్చింది. చేసిన పాత్రలను మళ్లీ చేయాలి అంటే తనకు బోర్‌ అని ఎప్పుడు కూడా తాను చేసిన పాత్రలను చేయను అంటూ చెప్పుకొచ్చింది.

తెలుగులో ‘ప్రేమమ్‌’ రీమేక్‌ చేసిన సమయంలో ఒరిజినల్‌ వర్షన్‌లో మలర్‌ పాత్ర పోషించిన సాయి పల్లవిని ఇక్కడ కూడా నటింపజేస్తే సినిమా స్థాయి మరింతగా పెరిగేది. ఆ విషయాన్ని ఆమె ముందు ప్రస్థావించగా తనను ఆ పాత్ర కోసం ఎవరు సంప్రదించలేదు అని, అయినా తాను మరోసారి ఆ పాత్రను చేసేందుకు ఒప్పుకునేదాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చింది. ‘ఫిదా’ సినిమాను రీమేక్‌ చేస్తే మరోసారి ఆ పాత్ర చేస్తారా అన్న ప్రశ్నకు కూడా ఆమె నో అనే సమాధానం చెప్పింది. ఒకసారి చేసిన పాత్రను మళ్లీ చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదు అని, ఎప్పుడు కూడా తాను అలాంటి పాత్రలు చేయాలని కోరుకోవడం లేదు అని చెప్పుకొచ్చింది. తెలుగులో అవకాశాలు వస్తున్నాయి కాని ఇంకా ఏది ఫైనల్‌ కాలేదు అని చెప్పుకొచ్చింది. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శర్వానంద్‌కు దాదాపుగా ఈ అమ్మడు ఓకే చెప్పినట్లే అని అంటున్నారు.

ముమైత్‌ ఆట పూర్తయ్యింది