యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సిగ్మా’పై Sigma ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. కోలీవుడ్ స్టార్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా హైస్టు థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా ‘సిగ్మా’ తెలుగు రిలీజ్కు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. నైజాం, కోస్తాంధ్ర ఏరియాల్లో ఈ సినిమాను మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేయనుంది. మరోవైపు సీడెడ్ హక్కులను ఎన్వీఆర్ సినిమాస్ దక్కించుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పడినట్లయింది.
జేసన్ సంజయ్ తన తొలి సినిమానే స్టైలిష్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో రూపొందించినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సందీప్ కిషన్ను కొత్త లుక్లో, పవర్ఫుల్ యాక్షన్ మోడ్లో ప్రజెంట్ చేసిన విధానం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో పాటు, టీజర్, ట్రైలర్లలో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
భారీ అంచనాల మధ్య ‘సిగ్మా’ అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్వైడ్గా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. మరి ఈ హైస్టు థ్రిల్లర్తో సందీప్ కిషన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.


