ఇళయ దళపతి, తమిళనాడు నూతన సీఎం Vijay కుమారుడు జేసన్ సంజయ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే హీరోగా కాదు, దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడం ద్వారా జేసన్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. తండ్రి స్టార్డమ్ నీడలో కాకుండా, కెమెరా వెనక తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకోవాలనే స్పష్టమైన ఆలోచన అతడిలో కనిపిస్తోంది.
ఆ డైరెక్షన్ డెబ్యూ ప్రాజెక్ట్గా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో Sundeep Kishan తో తెరకెక్కిన సినిమా ‘సిగ్మా’ (Sigma). యాక్షన్ డ్రామా జానర్లో ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకుంది. తాజా పోస్టర్తో జూలై 31న తమిళ్లో థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సందీప్ కిషన్కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉన్నా, ఈ సినిమాను ఒకేసారి తెలుగులో విడుదల చేస్తారా అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ముందుగా తమిళ్ రిలీజ్పై ఫోకస్ పెట్టిన మేకర్స్, పరిస్థితిని బట్టి తెలుగులోనూ ప్లాన్ ఖరారు చేసే అవకాశముందని టాక్.
ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ Faria Abdullah హీరోయిన్గా నటిస్తుండగా, భారీ స్థాయిలో Lyca Productions నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. దర్శకుడిగా జేసన్ సంజయ్ తొలి అడుగు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో, ‘సిగ్మా’తో స్పష్టమవ్వాల్సిందే.
