కొత్త బంగారు లోకంలోకి శ్వేత బస్సు ప్రసాద్…!

Shweta Basu Prasad To Marry Rohit Mittal In December

శ్వేతాబసు ప్రసాద్ త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్నిచిత్రాల్లో నటించింది కానీ సరైన గుర్తింపు రాలేదు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ కి వెళ్లి పోయారు. ప్రస్తుతం అక్కడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ హిట్ట్ చిత్రాల్లో నటించారు. తాజా సమాచారం మేరకు ఈమె గత కొంత కాలంగా ఒక్క అతనితో డేటింగ్ చేస్తుందంట. మహారాష్ట్ర కు చెందినా రోహిత్ మిట్టల్ అని ఇప్పుడు అతనినే పెళ్లి చేసుకోబోతున్నది.

Shweta-Basu-Prasad

వీరు బ్యాచిలర్ పార్టీ మూడ్ లో ఉన్నారు అంట. బాలిలో తమకు తెలిసిన కొద్ది మందికి బ్యాచిలర్స్ పార్టీ ఇచ్చారు. డిసెంబర్ పదమూడవ తేదిన విరి వివాహం జరగనున్నది. ఈ వివాహానికి బాలీవుడ్ కు చెందినా అతి కొద్ది మంది సెలబ్రిటీస్, మరియు సన్నిహితులు హాజరుకాన్నునారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన శ్వేతా తెలుగులో మాత్రం హీరోయిన్ గా సెట్ కాలేకపోయింది. ఇంకా పెళ్లి చేసుకొన్ని జీవితంలో సెట్ కావాలి అని చూస్తుంది. పెళ్లి పీఠలు ఎక్కబోతున్న కొత్తబంగారు లోకం ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు.

Shweta-Basu-Prasad-To-Marry