తాడిపత్రిలో దారుణం, ఆరుగురి దుర్మరణం !

Six workers killed in steel plant At Anantapur district

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న గరుడ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్‌లో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. స్టీల్ పరిశ్రమలో ఎప్పటిలాగే కార్మికులంతా పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. కార్బన్‌ డై ఆక్సైడ్ వాయువు ఎక్కువ శాతంలో లీక్ అవడంతో అక్కడున్న కార్మికులకు ఆక్సిజన్ అందలేదు. దీంతో ఊపిరాడక ఆరుగురు కార్మికులు మృతిచెందారు.

మరికొంతమంది అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే తాడిపత్రిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు లింగమయ్య, మద్దిలేటిరెడ్డి, మనోజ్‌కుమార్, రంగనాథ్, వాసింబాషా, గురువయ్యగా గుర్తించారు. ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై, మృతుల వివరాలపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.