అనంతలో మరో ఫాక్షన్ హత్య…పరిటాల కుటుంబం మీద ఆరోపణలు…!

Anantapur District Ysrcp Keshava Reddy Murder

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన మాజీ సర్పంచ్, వైసీపీ నేత కేశవరెడ్డిపై కొందరు దుండగులు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. కేశవరెడ్డి తోటకు వెళ్లి వస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కేశవరెడ్డిని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

yscr-cp

కాగా, ఈ దారుణానికి పాల్పడింది పరిటాల సునీత వర్గీయులేనని కేశవరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా కేశవరెడ్డికి అతడి బంధువు నరసింహారెడ్డికి మధ్య భూతగాదా నడుస్తుండగా నరసింహారెడ్డికి పరిటాల కుటుంబం అండ ఉందని అందుకే కేశవరెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు నరసింహారెడ్డిని ఉసిగొల్పి హత్య చేయించారని పరిటాల కుటుంబంపై కేశవరెడ్డి కుటుంబం ఆరోపణలు చేస్తోంది. ఈ సందర్భంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేశవరెడ్డి భార్య పోలీసులను ఆశ్రయించింది. కేశవరెడ్డి హత్య నేపథ్యంలో ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

murder-ys