Sports: నేటి నుంచి WPL .. ముంబై, ఢిల్లీ మధ్య తొలి పోరు

Sports: From today WPL .. first battle between Mumbai and Delhi
Sports: From today WPL .. first battle between Mumbai and Delhi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ శుక్రవారం ప్రారంభం కానుంది. డబ్ల్యూపీఎల్‌ 2024 సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరుగుతుండగా మొత్తం ఐదు టీమ్స్ 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. మొత్తం ఐదు జట్లు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్‌, యూపీ ఈ లీగ్‌ లో పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలు కానుంది.మిగిలిన మ్యాచ్‌లన్నీ 7.30 నుంచి ప్రారంభం కానున్నాయి. సీజన్లో మొదటి దశ మ్యాచ్లు బెంగళూరులో, ఆ తర్వాతి మ్యాచ్లు ఢిల్లీలో జరగనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ప్రారంభ వేడుక సహా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

భారత స్టార్లు స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్‌కౌర్‌, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ తో పాటు.. అంతరాతీయ స్టార్లు లానింగ్‌, అలీసా హీలీ, అమేలియా కెర్‌, మాత్యూస్‌, స్కీవర్‌, చమరీ ఆటపట్టు ఈ లీగ్‌లో ఆడనున్నారు.