అల్లు అరవింద్‌, సురేష్‌బాబులపై శ్రీరెడ్డి విమర్శలు

sri reddy comments on suresh babu and allu arvind

శ్రీరెడ్డి నోరుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏ రోజు ఆమె ఏం మాట్లాడుతుందో అంటూ అంతా కూడా ఒణికి పోతున్నారు. వరుసగా శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో తాజాగా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలో ఏ పేరు బయటకు వస్తుందో అని జనాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈమె ఒక వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఈమె మాట్లాడుతూ తమిళ సినిమా పరిశ్రమపై మరోసారి విరుచుకు పడటం జరిగింది. ముఖ్యంగా విశాల్‌తో పాటు ఇంకా పలువురు తమిళ సినీ ప్రముఖులుపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చెన్నై వెళ్లబోతున్నాను, అక్కడ పోలీసులను కలిసి ఫిర్యాదు చేయబోతున్నాను అంటూ ప్రకటించింది. ఇదే సమయంలో అల్లు అరవింద్‌ మరియు సురేష్‌బాబులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

గత కొంత కాలంగా సురేష్‌బాబు ఫ్యామిలీపై వీలున్నప్పుడల్లా విమర్శలు చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా అల్లు అరవింద్‌పై తనదైన శైలిలో విరుచుకు పడటం జరిగింది. సినిమా పరిశ్రమలో వీరిద్దరు పెద్ద వారు, థియేటర్లను తమ వద్ద ఉంచుకుని, వ్యాపారాలు చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం జీవితాలు నాశనం చేసుకునేందుకు కూడా కొందరు సిద్ద పడ్డా కూడా అవకాశాలు మాత్రం దక్కడం లేదని, అల్లు అరవింద్‌ మరియు సురేష్‌బాబులు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని అంటూ ఉంటారు. వారి కొడుకులను రోడ్డున వదిలేస్తే అమ్మాయిలను పీక్కు తినేస్తున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్క అమ్మాయిని వాడేసుకోవాలనే కుక్క బుద్దితో వారు ఉంటున్నారు. కొడుకులను సర్ది చెప్పి, సక్రమ మార్గంలో నడపలేరు కాని వీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యనించింది. ఇండస్ట్రీలో ఉన్న ఈ ఇద్దరు ప్రముఖులు తమ కొడుకులను అదుపులో పెట్టుకోకుంటే ఇంకా ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీరెడ్డి మరోసారి సురేష్‌బాబుపై అలాగే అల్లు అరవింద్‌పై తీవ్రంగా వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక చెన్నైలో ఈమె మూడు రోజులు ఉండి, ఏం చేయబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.