తారక్, చరణ్ శత్రువులు కాదు అన్నదమ్ములు.

Sridevi plays Mother Role in Ram Charan and NTR multistarrer Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తారక్, చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి మల్టి స్టారర్ ఖాయం అయినట్టే అని ఫిలిం నగర్ కోడై కూస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకో కీలక విషయం కూడా బయటకు వచ్చింది. సాధారణంగా మల్టి స్టారర్ అనగానే ఇద్దరు హీరోల పాత్రలు డీ అంటే డీ అనే విధంగా వుంటాయని ఊహించుకుంటారు. ఇక మనోభావాల పేరుతో సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఆ రచ్చ కొనసాగుతుంది. ఒకరి పాత్ర ఎక్కువ ఇంకొకరి పాత్ర తక్కువ అనే చర్చ కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మెగా, నందమూరి ఫాన్స్ మధ్య ఎప్పటినుంచో ఓ వార్ జరుగుతూనే వుంది. ఇప్పుడు ఈ మల్టి స్టారర్ లో వాళ్లిద్దరూ తలపడే సన్నివేశాలు ఉంటే అది ఇంకెక్కడికి దారి తీస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇదంతా ముందే ఊహించి రాజమౌళి తారక్, చరణ్ కాంబినేషన్ లో చేసే సినిమాకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట.

Ram-Charan-and-NTR

రాజమౌళి సినిమాలో తారక్, చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారట. ఈ సినిమా పూర్తిగా కుటుంబ బాంధవ్యాల నేపథ్యంలో వుంటుందట. రాజమౌళి మార్క్ ఎమోషన్ మిస్ గాకుండా కుటుంబ విలువలకు పెద్ద పీట వేసే ఈ సినిమా విడుదల అయ్యాక నందమూరి, మెగా ఫాన్స్ కూడా సోదర భావంతో మెలిగేలా కథ వుంటుందట. ఇక ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ తల్లి పాత్ర కోసం శ్రీదేవి పేరు పరిశీలిస్తన్నట్టు తెలుస్తోంది. అదే నిజం అయితే తారక్ చిరకాల కోరిక కూడా రాజమౌళి నెరవేర్చినట్టే. తన అభిమాన నటి శ్రీదేవి తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఏ చిన్న పాత్ర అయినా చేస్తానని ఒకప్పుడు తారక్ అన్నారు. ఇప్పుడు ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుంది. నందమూరి హీరో, మెగా హీరోతో కలిసి మల్టి స్టారర్ చేయడం అనే ఊహకు కూడా భయపడ్డ తెలుగు ప్రేక్షకులకు అది నిజమై కనిపించబోతోంది.