పూరి కొడుకుతో జతకట్టనున్న మిస్ ఢిల్లీ…!

Star Director Puri Jagannadh Son To Romance Miss Delhi

వరుస ప్లాపు సినిమాలతో పూర్తిగా అవుట్ డేటెడ్ అయిపోయిన పూరి జగన్నాథ్ తన కొడుకు ని హీరోగా పరిచయం చేసి ఎలాగైనా హిట్టు కొట్టాలనుకొని, మగధీర ని పోలిన పునర్జన్మల కథతో ‘మెహబూబా’ సినిమా తీసినా, అదికూడా అట్టర్ ప్లాప్ అయ్యేసరికి ఏమి చేయాలో పాలుపోవట్లేదు పూరి మరియు అతని కొడుకు ఆకాష్ పూరి కి. పూరి తనని తప్ప ఏ దర్శకుడిని అంతగా నమ్మడు. ఇక తన కొడుకు విషయంలో ఇంకెంత ఆలోచిస్తాడో అనేది మెహబూబా తో అర్ధం అయ్యింది. కథ సరిగ్గా రాసుకోవడానికి కూడా బద్ధకించే పూరి జగన్నాథ్ ఈ మధ్య తన మూస టేకింగ్ తో కూడా ప్రేక్షకులను, తన అభిమానులని నిరాశపరుస్తున్నాడు.

delhi-beauty

 

ఒక దర్శకుడు అయ్యుండి తన కొడుకు తో సినిమా తీసి, హిట్టు ఇవ్వమని ఇంకో దర్శకుడిని అడిగే పరిస్థితి కూడా లేదు. అందుకే తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఆకాష్ పూరి సరసన ఎవర్ని హీరోయిన్ గా తీసుకోవాలో అని కొన్ని నెలలు తర్జనభర్జనలు పడ్డాక కొత్త హీరోయిన్ వైపే మొగ్గు చూపారు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి, మిస్ ఢిల్లీ కిరీటం ధరించిన గాయత్రి భరద్వాజ్ ని ఈ సినిమాతో తెలుగు చిత్రసీమ కి హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. ఈసారి కథను తాను రాయకుండా, తన అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ రాసిన కథకే కాసిన్ని మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన మిగతా నటులు మరియు టెక్నీషియన్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Star Director Puri Jagannadh Son To Romance Miss Delhi