ఏపీ గవర్నర్ గా సుష్మా స్వరాజ్…కేంద్రమంత్రి ట్విస్ట్

sushma swaraj as ap governer

ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని భావిస్తోన్న బీజేపీ ఇందుకోసం గవర్నర్‌ను మార్చనుందని చాలా సార్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్‌లను నియమించబోతున్నారంటూ నిన్నటి నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ అయిన తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన సుష్మా స్వరాజ్‌ను ఏపీ గవర్నర్ చేస్తారనే వార్త జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుష్మను నియమిస్తున్నారని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేసి తర్వాత తన ట్వీట్‌ను తొలగించారు. దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. అయితే, మరోపక్క, తాను ఏపీ గవర్నర్‌గా నియమితులైనట్టు వచ్చిన వార్తలపై సుష్మ స్వయంగా స్పందించారు.  తనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తారని వస్తున్న వార్తలు నిజం కాదని ఆమె తేల్చి చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు, సుష్మా అభిమానులు ఒకింత నిరాశకు లోనయ్యారు.